Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Two Days Bank Holidays News: బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Stock Market: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Budget 2025: 2025 బడ్జెట్లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం.
Union Budget 2025: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్కు నిర్ణయాత్మక ఘట్టమైన 'బడ్జెట్' కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు.
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
Economic Survey: ఉద్యోగుల పనిగంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలను వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.
Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Pm Modi On Budget 2025: బడ్జెట్ 2025 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేయవచ్చని సూచించారు. మధ్యతరగతి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపుతో ఇది ముడిపడి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వార్షిక పద్దుపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.
Budget 2025 Expectations: దేశమంతా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2025 మరో రెండ్రోజుల్లో ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ట్యాక్స్ పేయర్ల నుంచి కూడా చాలా అంచనాలున్నాయి.
Budget 2025: టాక్స్ పేయర్లు క్కువగా ట్యాక్స్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం టాక్స్ శ్లాబుల్ని సరళీకరించినప్పటికీ..నిర్దిష్ట మొత్తం ఆదాయం దాటితే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే కొన్ని పెట్టుబడులతో పన్ను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్ తగ్గించుకునేందుకు ఎలాంటి ప్రణాళికులు వేసుకోవాలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.