Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం వాయిదాపడింది. వైఎస్ఆర్ జయంతి నాడు పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ( AP govt ) భావించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దీనిని వాయిదా వేసింది.
New districts in AP: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ( AP new districts ) ఏర్పడుతున్నాయి. ఈ దిశగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ( AP CM YS Jagan ) ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది.
Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది.
Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
AP SSC Exams 2020 | అమరావతి: కరోనా వైరస్ (CORONAVIRUS) విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP govt) కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదో తరగతితో పాటు (10th Class exams), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (Inter supplementary exams) పరీక్షలను రద్దు చేసింది.
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది.
Coronavirus in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ సర్కార్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల ( Health bulletin) చేసింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,911 బ్లడ్ శాంపిల్స్పై కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests) జరపగా.. అందులో 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 253 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
AP COVID-19 Updates: అమరావతి : ఏపీలో కరోనావైరస్ కోరలు చాస్తోంది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఓవైపు భారీ సంఖ్యలో కోవిడ్-19 టెస్టులు (COVID-19 tests) చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనా నివారణ కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు.
Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో పవర్ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్.
నిరుపేదలకు అందరికీ స్థిర నివాసం ఉండాలని సంకల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan).. అధికారంలోకి రాకముందే నవరత్నాలులోనే ( Navaratnalu ) ఆ అంశాన్ని చేర్చి ఆ దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి నిరుపేదలకు గృహ నిర్మాణంపై దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.