KTR Plans for Revanth Reddy: ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Ys Sharmila-Congress: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా విన్పిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ వ్యవహారంలో మొదలైన చర్చ ఆమె తాజా ట్వీట్తో పీక్స్కు చేరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు.
Congress Party: కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కొత్తగా కీలక నేతల చేరికతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించుకుంది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయమే మిగిలింది. మరోసారి అధికారం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే..బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
YSRTP Merging In Congress: రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైఎస్సార్టీపీ విలీనం దిశగా చర్చలు మొదలుపెట్టారని.. వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందని రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే ఈ విషయంపై స్వయంగా స్పందించారు.
Revanth Reddy Questions KCR and KTR: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపించి, మీరు మోసపోవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.