Delhi Assembly Elections 2025: ఢిల్లీ శాసన సభ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి.1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని మార్చి సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది. రెండున్నరేళ్ల తర్వాత చివర్లో సుష్మా స్వరాజ్ ను ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత 1998, 2003, 2008లో వరుసగా షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 యేళ్లు హస్తిను పరిపాలించింది. ఆమె హయాంలోనే మెట్రో రైలు సహా ఢిల్లీలో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగియా. ఆ తర్వాత 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొరపొచ్చాల కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలిది. ఆ తర్వాత 2015 ఆప్ .. 70 సీట్లకు గాను 67 సీట్లలో గెలిచి సంచలనం రేపింది.
ఆ తర్వాత 2020లో 62 సీట్లలో గెలిచింది. ఆ సమయంలో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. తాజాగా 2025లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికల తర్వాత వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీ పీఠం సుధీర్ఘ కాలం తర్వాత బీజేపీ వశం కానున్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపుపై దేశ రాజధాని ప్రజల స్పందన ఫిబ్రవరి 8వ తేదీన వెలువడే ఫలితాల్లో తేలనుంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఫేస్ లేకుండా.. కేవలం నరేంద్ర మోడీ ఫేస్ తోనే ఎన్నికలను ఫేస్ చేసింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీకున్న సింపతీ.. పూర్తిగా తొలిగిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాట్ పోల్ అని చెప్పలేము. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది.
దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ అలయన్స్ భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండనుంది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలంపైగా అధికారంలో ఉన్న ఆప్ కు భంగపాటు తప్పదంటున్నారు. ఇక అధికారానికి 27 ఏళ్లు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలున్నట్టు ఎగ్టిట్ పోల్లో వెల్లడైంది. మరి సుధీర్ఘ కాలం అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీకి ఈ సారైనా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఢిల్లీ పీఠం దక్కించుకుంటుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.