లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం

నేడే లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్

Last Updated : May 19, 2019, 12:50 AM IST
లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిసి మొత్తం 59 లోక్ సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారమే ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్, ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

ఇప్పటి వరకు గడిచిన ఆరు విడతల పోలింగ్‌లో 483 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా చివరి విడత ఎన్నికలతో 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలకు కలిపి మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x