Big Jackpot To Employees 7 Percent Dearness Allowance Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఏ భారీగా పెంచడంతో వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు జార్ఖండ్ ప్రభుత్వం కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) భారీగా పెంచేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డీఏలో 7 శాతం పెంపును మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
డీఏ పెరుగుదల 2024 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం జార్ఖండ్ మంత్రి కీలక ప్రకటన చేశారు.
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఆరో వేతన సంఘం ప్రకారం ఉద్యోగులు ప్రస్తుత మూల వేతనంలో 246 శాతం కరువు భత్యం పొందుతారు. గత డీఏ కన్నా 239 శాతం నుంచి పెరుగుదల.
అదనంగా ఆరో వేతన సంఘం కింద పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఆర్) పరిహారం కూడా ఏడు శాతం పెరగడం విశేషం. గతంలో 239 శాతం నుంచి 246 శాతానికి పెరిగింది.
ఐదో వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల డీఏను జూలై 1 2024 నుంచి 443 శాతం నుంచి 455 శాతం వరకు నిర్ణయించినట్లు జార్ఖండ్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.
డీఏ పెంపుతో పాటు మొత్తం 12 ప్రతిపాదనలను అక్కడి మంత్రివర్గం ఆమోదించింది. మహిళా కార్మికులు తమ అంగీకారంతో కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అవకాశం కల్పించింది. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు రాత్రివేళ్ల పని చేయడానికి అవకాశం దక్కింది.