IPL 2019 Auction : వారెవ్వా.. రూ.8.40 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్!

రూ.8.40 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్!  

Last Updated : Dec 19, 2018, 12:17 PM IST
IPL 2019 Auction :  వారెవ్వా.. రూ.8.40 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్!

జైపూర్: ఐపీఎల్ 12వ సీజన్ కోసం ఇవాళ జైపూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ వేలంలో యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ రూ.8.40 కోట్లు ధర పలికాడు. ఈ ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న అనేక మంది ఆటగాళ్లకన్నా ఇది చాలా ఎక్కువ మొత్తం కావడం విశేషం. వేలంలో ఇతర జట్లతో పోటీ పడి మరీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జయదేవ్‌ని కొనుగోలు చేసింది. గత ఐపీఎల్‌తోపాటు ఇతర టోర్నీలలో జయదేవ్ ఉనద్కత్ కనబర్చిన ప్రతిభ ఆధారంగా అతడికి ఈ ఐపీఎల్ వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది.

గతేడాది ఐపీఎల్ 2018 సీజన్ కోసం జరిగిన వేలంలోనూ రూ.11.5 కోట్లు పలికి, అత్యంత ధర పకిలిన భారతీయ ఆటగాళ్లలో టాప్ పొజిషన్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. చివరి సీజన్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టే అతడిని సొంతం చేసుకోవడం మరో విశేషం.

Trending News