Hyper Aadi releases apology video: హైదరాబాద్: హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిచేలా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ఓ స్కిట్ ప్రదర్శించాడని అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Complaint lodged against hyper aadi: జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిథులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజానీకం పవిత్రంగా భావించి, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పూజించే గౌరమ్మ తల్లిని కించపరిచేలా జూన్ 13వ తేదీన ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ చేశారని, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని టీజేఎస్ఎఫ్ నేతలు (TJSF) తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Case filed on TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డిపై హైదరాబాద్లోని జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా తహశీల్దార్ గౌతం రెడ్డి తలదూర్చి తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు.
Anchor Shyamala's husband Narasimha Reddy arrested in cheating case: ఓ చీటింగ్ కేసులో ఫేమస్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి (Sindhura Reddy) అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు.
Penalty on no mask: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. మాస్క్ లేకపోతే భారీ జరిమానా విధిస్తోంది.
Wine Shops In Hyderabad: తాజాగా హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు తాత్కాలికంగా నిషేధం విధించారు. వైన్ షాప్స్ బంద్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
Actress Madhavilatha filed complaint: సినిమాలకు గుడ్ బై చెప్పి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరోయిన్ మాధవీలతకు ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. BJP మహిళా నాయకురాలిగా సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాధవీలత.. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నారు.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. హైదరాబాద్ (Hyderabad) లోని గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Dr jayaram murder case: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, న్యూస్ ఛానెల్ అధినేత డాక్టర్ జయరాం హత్యకేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో పోలీసు అధికారుల పాత్రపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ( Tejaswi Surya ) పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు (Case registered) ఆయనపై కేసు నమోదు అయ్యింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.