జీఎస్టీపై క్రికెటర్ బజ్జీ హాట్ కామెంట్స్

Last Updated : Sep 30, 2017, 12:45 PM IST
జీఎస్టీపై క్రికెటర్ బజ్జీ హాట్ కామెంట్స్

దేశంలో జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి ఒక్కో ప్రముఖులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా జీఎస్టీపై సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై పలువురు నెటిజన్లు బజ్జీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆయనేం కామెంట్ చేశారంటే .. "రెస్టారెంట్లో భోజనం చేసి బిల్లు కడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భోజనం చేసిన ఫీలింగ్ వస్తోంది" అని పోస్ట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు.  ప్రముఖ క్రికెటర్లే ఇలా ఫీలయితే, సామాన్యమానవుడి పరిస్థితి ఏంటీ? అని ఒకరు, ఇదివరకైతే విడివిడిగా భోంచేసేవారని, ఇప్పుడు కలిసి భోంచేస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. 

 

 

Trending News