చెన్నైలోని రాజాజీ హాల్ వద్ద తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. భారీ జన సందోహాన్ని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో డీఎంకే వర్గాలు, పార్టీ మద్దతుదారులు సంయమనం పాటించాల్సిందిగా కరుణానిధి తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం క్షిణిస్తోందని కావేరి ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రితోపాటు గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసం ఎదుట సైతం భారీ భద్రత ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్.
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని.. 24 గంటలు దాటితే తప్పితే ఏ విషయం కూడా తాము కచ్చితంగా తెలియజేయలేమని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది.
డీఎంకే నేత ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.