Pm Modi On Budget 2025: బడ్జెట్ 2025 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేయవచ్చని సూచించారు. మధ్యతరగతి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపుతో ఇది ముడిపడి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వార్షిక పద్దుపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.
Budget 2025 Expectations: దేశమంతా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2025 మరో రెండ్రోజుల్లో ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ట్యాక్స్ పేయర్ల నుంచి కూడా చాలా అంచనాలున్నాయి.
Budget 2025: టాక్స్ పేయర్లు క్కువగా ట్యాక్స్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం టాక్స్ శ్లాబుల్ని సరళీకరించినప్పటికీ..నిర్దిష్ట మొత్తం ఆదాయం దాటితే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే కొన్ని పెట్టుబడులతో పన్ను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్ తగ్గించుకునేందుకు ఎలాంటి ప్రణాళికులు వేసుకోవాలో చూద్దాం.
Budget 2025: ఆదాయపు పన్నుకు కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పది లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంతోపాటు కొత్తగా 25% శ్లాబ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సెషన్ లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇది కొత్త చట్టం, ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం తెలుసుకుందాం.
Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.
Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్టెట్ ఏ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఏ సమయంలో ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.