Riddhi Kumar: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో నటించాలనుంది

Riddhi Kumar: కేరళ కుట్టి, అందాల తార రిద్ధి కుమార్ తెలుగు తెరకు పరిచయమైన నటే అయినా..మరోసారి బిగ్‌స్క్రీన్‌పై మెరవబోతోంది. అది కూడా పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్‌లో. ఆ వివరాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2022, 07:03 PM IST
Riddhi Kumar: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో నటించాలనుంది

Riddhi Kumar: కేరళ కుట్టి, అందాల తార రిద్ధి కుమార్ తెలుగు తెరకు పరిచయమైన నటే అయినా..మరోసారి బిగ్‌స్క్రీన్‌పై మెరవబోతోంది. అది కూడా పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్‌లో. ఆ వివరాలేంటో చూద్దాం.

అందమైన రూపం, అంతకంటే అందంగా అభినయం. చూడ చక్కని ఫిజిక్ కూడా. అందాల ఈ కేరళ కుట్టి అనతికాలంలోనే మంచి గుర్తింపే తెచ్చుకుంది. 2018లో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు జోడీగా లవర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత అనగనగా ఓ ప్రేమ కధలో కూడా నటించినా ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రిధీ కుమార్‌కు..మలయాళం, కన్నడ, మరాఠీ చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో అవకాశాలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగు సినిమాకు దూరమైనా సరే..ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ మాధ్యమాల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటోంది. 

ఇప్పుడు శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న కోతి కొమ్మచ్చి సినిమాలో కథానాయికగా కన్పించనుంది. ఇప్పుడు ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాతో బిగ్‌స్క్రీన్‌పై కన్పించనుంది. ఏకంగా ప్రభాస్ హీరోగా మార్చ్ 11న విడుదల కానున్న రాధేశ్యామ్‌లో నటించనుంది. ఈ సినిమాలో స్పోర్ట్స్ విమెన్‌గా కన్పించనున్న రిద్ధీ కుమార్ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదు. రాధేశ్యామ్ ట్రైలర్‌లో మాత్రం కన్పించింది. రాధేశ్యామ్ సినిమాలో రిద్దీ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి ప్రారంభమైంది. తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలే అయినా..ఏకంగా ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకోవడమంటే..నిజంగా అదృష్టం ఉన్నట్టే.

రాధేశ్యామ్‌లో అవకాశం రావడంపై చాలా ఆనందంగా ఉందంటోంది ఈ ముద్దుగుమ్మ. పూణేలో డిగ్రీ చదివిన ఈ భామకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. అందుకు తగ్గట్టే మోడలింగ్‌లో ప్రవేశించి..అక్కడి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. రాధేశ్యామ్ సినిమాలో స్పోర్ట్ విమెన్‌గా పాత్ర పోషిస్తున్న రిధీ కుమార్..కేవలం ఆ పాత్ర కోసమే ఆర్చరీ నేర్చుకుందట. ప్రభాస్ కూడా మంచిగా ఉంటూ జోకులతో నవ్విస్తుండేవారని చెబుతోంది. ప్రభాస్ వంటి హీరోతో పనిచేయడం చాలా అదృష్టమని మురిసిపోతోంది. ఈ సినిమాలో నటనకు అవకాశమున్న పాత్ర పోషిస్తున్నానని చెప్పింది. రాధేశ్యామ్ సినిమాలో తన పాత్ర, నటనను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా ఉందని చెబుతోంది. కచ్చితంగా తన పాత్ర ఏంటనేది మాత్రం చెప్పనంటోంది. కేరళ కుట్టి పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే మార్చ్ 11 వరకూ ఆగాల్సిందే మరి.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌సిరీస్ స్టూడెంట్ జానర్‌లో నటిస్తోంది. మే నెలలో విడుదల కానున్న ఈ వెబ్‌సిరీస్‌లో కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్దున్, విజయ్ దేవరకొండతో పాటు అందరు తెలుగు హీరోలతో నటించాలనే కోరిక ఉందంటోంది.

Also read: Bahubali Part 3: బాహుబలి పార్ట్ 3 కచ్చితంగా ఉంటుందంటున్న ప్రభాస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News