TGPSC Group 1 Mains: గ్రూప్ 1 ఎగ్జామ్‌లో షాకింగ్.. చీర కొంగులో చిట్టీలు పెట్టుకుని మహిళ కాపీయింగ్.. ఎక్కడంటే..?

TGPSC Group 1 main examination: తెలంగాణలో ఇటీవల గ్రూప్ ఎగ్జామ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాాగా,  జరిగిన ఎగ్జామ్ లో ఒక మహిళ మాస్ కాపీయింగ్ పాల్పడుతూ దొరికిపోయినట్లు తెలుస్తొంది.

1 /6

తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు కొలువులు వస్తాయని చాలా మంది భావించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు కొలువు కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు అనేక ట్విస్ట్ లు ఎదురయ్యాయని చెప్పుకొవచ్చు.

2 /6

తెలంగాణలో గత కొన్నేళ్లుగా గ్రూప్ ఎగ్జామ్ లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. గ్రూప్ 1, 2, 3 లు కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన విషయం తెలసిందే. అయితే.. గ్రూప్ 1 అభ్యర్థుల బాధలు మాత్రం వర్ణానాతీం.  

3 /6

దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా, గ్రూప్ 1 ఎగ్జామ్ లు  ప్రారంభమయ్యాయి. అంతకుముందు అనేక నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. గ్రూప్ 1 అభ్యర్థులు ఎగ్జామ్ లను వాయిదా వేయాలని రచ్చ చేశారు. 

4 /6

ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ తోపాటు బీజేపీ పార్టీ కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. గ్రూప్ 1  అభ్యర్థులు తెలంగాణ సెక్రెటెరియట్ ను సైతం ముట్టడించేందుకు ప్రయత్నించారు.

5 /6

ఇన్ని అడ్డంకుల తర్వాత గ్రూప్  ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో..  ఇబ్రహీం పట్నంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మహాబూబ్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్మీ ఇస్లావత్ లో ఎగ్జామ్ కు హజరయ్యారు. ఆమె ఎగ్జామ్ మధ్యలో కాపీయింగ్ కు పాల్పడినట్లు తెలుస్తొంది. 

6 /6

ఆమె చీర కోంగులో చిటీలుపెట్టుకుని  వచ్చారని, ఎగ్జామ్ మధ్యలో ఆమె చేస్తున్న వ్యవహారాన్ని ఇన్విజిలెటర్ గుర్తించారు. వెంటనే అక్కడున్న టీజీఎస్పీఎస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. దీంతో టీజీఎస్పీఎస్సీ సదరు అభ్యర్థిని దగ్గర చిట్టీలు గుర్తించి, ఆమెను డిబార్ చేసినట్లు తెలుస్తొంది.