వైఎస్ వివేకా హత్య కేసు: ఆదినారాయణ రెడ్డిపై రోజా సంచలన ఆరోపణలు

వైఎస్ వివేకా హత్య కేసు: ఆదినారాయణ రెడ్డిపై రోజా సంచలన ఆరోపణలు

Last Updated : Mar 17, 2019, 11:40 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు: ఆదినారాయణ రెడ్డిపై రోజా సంచలన ఆరోపణలు

తిరుమల: వైఎస్ జగన్ చిన్నాన్న, రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో టిడిపి నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులో ఓడిపోతారనే భయంతోనే టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డే ఈ హత్య చేయించారని ఆమె ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను నేరుగా ఢీకొట్టే ధైర్యం చేయలేక ఆయన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని కుట్ర పన్నారని ఆదినారాయణ రెడ్డిపై, టిడిపిపై విమర్శలు గుప్పించారు.

గతంలో పరిటాల రవి హత్యపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఎందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకొస్తాయనే భయంతోనే చంద్రబాబు సర్కార్ సిబిఐ విచారణకు కోరడం లేదని రోజా వ్యాఖ్యానించారు.

Trending News