రేపిస్ట్ మామను కొట్టిచంపిన కోడలు.. పోలీసుల ఎదుట లొంగుబాటు

కూతురిలా చూసుకోవలసిన మామే 26 ఏళ్ల కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Last Updated : Mar 5, 2018, 05:50 PM IST
రేపిస్ట్ మామను కొట్టిచంపిన కోడలు.. పోలీసుల ఎదుట లొంగుబాటు

లక్నో: కూతురిలా చూసుకోవలసిన మామే 26 ఏళ్ల కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వరుసగా రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె చేతిలోనే తన్నులు తిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ ఫిలిబిత్‌లోని మధోటండా పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు స్వయాన తన మామని కర్రతో కొట్టి చంపడంతో స్థానికంగా ఆ సంఘటన అలజడి రేపింది. ఆమెకు భర్త కూడా సహాయం చేయడం గమనార్హం. హత్య చేసిన తరువాత, ఆ జంట పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. నిందితుడి పెద్ద కుమారుడు చేసిన ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బాధితురాలి కథనం మేరకు.. తన భర్త పని కోసం బయటకు వెళ్లినప్పుడు నిందితుడు మొదటిసారి శుక్రవారం నాడు అత్యాచారం చేశాడు. మీడియా నివేదికల ప్రకారం బాధితురాలి భర్త అత్యాచారం చేస్తుండడం కళ్లారా చూశాడని తెలిపాయి. ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, హతుడి భార్య నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.

Trending News