Sushant Singh Rajput post mortem : సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే!.. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి చెప్పాడట.. ట్వీట్ వైరల్

Sushant Singh Rajput post mortem సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ సోషల్ మీడియా గొంతెత్తి చెబుతోంది. సుశాంత్ తల్లిదండ్రులు, సోదరి కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక సుశాంత్ సింగ్‌ది మాత్రం సూసైడ్ అని ముంబై పోలీసులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 04:59 PM IST
  • సుశాంత్ సింగ్ కేసులో కొత్త కోణం
  • సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే
  • హాస్పిటల్ ఉద్యోగి కామెంట్లు వైరల్
Sushant Singh Rajput post mortem : సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే!.. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి చెప్పాడట.. ట్వీట్ వైరల్

Sushant Singh Rajput post mortem బాలీవుడ్ ప్రస్తుతం ఇంతటి ధీనావస్థలో ఉండటానికి ప్రధాన కారణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేస్. గత రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించాడు. ముంబై పోలీసులు మాత్రం దీన్ని సూసైడ్‌ కేసుగానే నమోదు చేశారు. అలానే దర్యాప్తు చేశారు. కానీ ఆ తరువాత జనాగ్రహం చూసి ఆ కేసును మిస్టరీ కేసుగా మార్చారు. ఈడీ, సీబీఐ, ఎన్‌సీబీ వంటివి కూడా ఆ కేసును చేతిలోకి తీసుకుంది. కానీ ఇంత వరకు నిజాన్ని బయటకు తీసుకురాలేకపోయింది.

బాలీవుడ్ అంతా కలిసి సుశాంత్ సింగ్‌ను పొట్టన పెట్టుకుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియా చక్రవర్తి చుట్టూనే ఈ కేసు తిరిగింది. సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్‌ది కూడా హత్యనా? ఆత్మహత్యనా? అనేది తేల్చి లేకపోయారు. ఈ రెండు కేసులకు సంబంధం ఉండే ఉంటుందని జనాలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రియా చక్రవర్తి మహేష్ భట్ ఫోటోలు వైరల్ అవ్వడం, సుశాంత్‌కు రియా డ్రగ్స్ ఇవ్వడం ఇలా ఈ కేసులో ఎన్నెన్నో కోణాలు బయటకు వచ్చాయి.

 

చివరకు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని ఈడీ, ఎన్‌సీబీ కూడా విచారించింది. మొత్తానికి వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు సుశాంత్ కేసు మీద ఎలాంటి టాపిక్ మాత్రం బయటకు రావడం లేదు. కానీ తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ నాడు పోస్ట్ మార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్ ఉద్యోగి చెబుతున్న మాటలు, వాటికి సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

 

సుశాంత్ డెడ్ బాడీ వచ్చిన రోజే మరో నాలుగు కేసులు కూడా వచ్చాయట. ముందు అది సుశాంత్ బాడీ అనుకోలేదట. కానీ సుశాంత్ బాడీ అని తెలిశాక.. చూసిన మొదటి క్షణంలోనే అది సూసైడ్ కాదని, మర్డర్ అని అర్థమైందట.. మెడ మీద గాట్లు కూడా కనిపించాయట. ఇదే విషయాన్ని తన పై అధికారులకు కూడా చెప్పాడట. కానీ వారి ఆదేశాల మేరకు పని చేశాడట. ఫోటోలు తీసి పోలీసులకు ఇవ్వమని చెప్పాడట. అలానే చేశాడట. ఆ తరువాత పై అధికారులు చెప్పినట్టుగా పోస్ట్ మార్టం చేశాడట. 

 

మొత్తానికి ఇప్పుడు ఈ విషయాలు మాత్రం జాతీయ మీడియాను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని పోలీసులు విచారించాల్సి ఉంది. కానీ జనాలు మాత్రం వెరైటీ రియాక్ట్ అవుతున్నారు. ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు.. మేం ఇన్నాళ్లుగా చెబుతున్నది కూడా అదే అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. 

Also Read : Adivi Sesh Supriya Dating : అడివి శేష్‌-సుప్రియ డేటింగ్‌?.. దూరంగా నాగ చైతన్య.. ఆ పిక్‌తో సీక్రెట్ రివీల్

Also Read : Mouni Roy Pics : మౌనీ రాయ్.. కొంప ముంచేసేలా ఉందోయ్.. ఎగసిపడుతున్న ఎద అందాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News