చంద్రబాబు పాలనపై కన్నా కేంద్రానికి ఫిర్యాదు

                                             

Last Updated : Jul 16, 2018, 03:43 PM IST
చంద్రబాబు పాలనపై కన్నా కేంద్రానికి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కన్నా ఈ రోజు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రానికి కంప్లైంట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవని..బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న  దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నందుకే తమపై దాడులు చేస్తున్నారని కన్నా ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ
ఈ సందర్భంగా కన్నా చంద్రబాబు సర్కార్ పై సంచలన ఆరోపణ చేశారు. తనతో పాటు బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని కేంద్రం చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు కన్నా పేర్కొన్నారు. కాగా అవిశ్వాస తీర్మానం అంశంపై స్పందిస్తూ  కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతామంటూ టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీస్తోందని విమర్శించారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ పీసీసీ చీఫ్ కన్నా వెల్లడించారు.

Trending News