DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా డీఏ ఎరియర్లు కూడా

7th Pay Commission DA Hike: ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి,  జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. 

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని బట్టి డీఏ పెంపు ఎంత అనేది ఉంటుంది. కనీస వేతనం 18 వేలుంటే..డీఏ 3 శాతం అనుకుంటే జీతం నెలకు రూ.540 పెరుగుతుంది. ఏడాదికి 6,480 రూపాయలు ఉంటుంది. అదే 4 శాతం డీఏ అయితే జీతం 720 రూపాయలు పెరుగుతుంది. కనీస వేతనం 50 వేలుండి డీఏ 3 శాతం పెరిగితే నెలవారీ జీతం 1500 రూపాయలు పెరుగుతుంది.

1 /8

7వ వేతన సంఘం ప్రకారం డియర్‌నెస్ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. డీఏ ఎవరికి ఎంత పెరుగుతుంది, డీఏ బకాయిలు కూడా అందనున్నాయా లేదా అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 /8

ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జూలై 2024కి డీఏ 3-4 శాతం ఉంటుందని అంచనా. ఎప్పటిలా 4 శాతం కాకుండా ఈసారి 3 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అంటే మొత్తం డీఏ 53 శాంతం కానుంది. 4 శాతం పెరిగితే మాత్రం 54 శాతమౌతుంది. 

3 /8

డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు విడుదలైనా సరే జూలై నెల నుంచి లెక్కించి ఎరియర్లతో పాటు అందించనున్నారు. అంటే అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. 

4 /8

అన్నింటికీ మించి కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా నిలిపివేసిన 18 నెల డీఏ బకాయిలు విడుదల చేయాలని చాలాకాలంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇవి దీపావళి కానుకగా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. 

5 /8

కానీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 18 నెలల బకాయిలు విడుదల చేసే ఆలోచన లేదనే చెప్పారు. అయితే దసరా సందర్భంగా 70 లక్షలమంది ఉద్యోగులకు ఆ డబ్బులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. 

6 /8

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనప్పటికీ.. దీపావళికి ముందు జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

7 /8

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేలుండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 540 రూపాయలు ఏడాదికి 6,480 రూపాయలు పెరుగుతుంది. అదే 4 శాతం పెరిగితే నెలకు 720 రూపాయలు ఏడాదికి 7440 రూపాయలు పెరుగుతాయి. 

8 /8

ఇక నెలకు 50 వేలు కనీస వేతనం ఉండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 1500 రూపాయలు ఏడాదికి 18 వేలు అందుతాయి. ఉద్యోగుల స్థాయి కనీస వేతనం బట్టి ఎవరికి ఎంత పెరుగుతుందనేది ఉంటుంది.