అరుణ్ జైట్లీని పరామర్శించేందుకు ఎయిమ్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

అరుణ్ జైట్లీని పరామర్శించేందుకు ఎయిమ్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Last Updated : Aug 16, 2019, 12:33 PM IST
అరుణ్ జైట్లీని పరామర్శించేందుకు ఎయిమ్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపి అగ్రనేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 9న ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ అప్పటి నుంచే నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఐసీయులోని వెంటిలేటర్‌పై జైట్లీకి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితర బీజేపి అగ్రనేతలు ఆయన్ను పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జైట్లీని పరామర్శించనున్నారు.

Trending News