7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఏడాదిలో జనవరి, జూలైలో ఈ పెంపు ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జనవరి 2025 పెంపు ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో అంటే హోలీ నాటికి డీఏ పెంపు ప్రకటన వెలువడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతి అందనుంది. మార్చ్ 14, 2025 హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. 7వ వేతన సంఘం ప్రకారం రావాల్సిన జనవరి నెల డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలల డీఏ ఎరియర్లతో కలిపి మార్చ్ నెలలో ఒకేసారి పెద్దమొత్తంలో జీతం అందుకోనున్నారు. అంటే మార్చ్ నెల జీతం ఎక్కువ మొత్తంలో అందుకుంటారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం డియర్నెస్ అలవెన్స్ ఈసారి 3-4 శాతం ఉండవచ్చని అంచనా ఉంది. అంటే లెవెల్ 1 ఉద్యోగులకు నెలకు 540 నుంచి 720 రూపాయల వరకు పెరగనుంది. ఈ లెక్కన లెవెల్ 1 ఉద్యోగులకు కనీసం వేతనం 18 వేలు ఉంది. ప్రస్తుతం 50 శాతం డీఏతో 9 వేలు అందుతోంది. ఇప్పుడు మరో 3 శాతం పెరిగితే 9,540 రూపాయలు డీఏ రూపంలో అందుకుంటారు. ఒకవేళ డీఏ 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 9,720 రూపాయలు ఉంటుంది.
ఇదే 7వ వేతన సంఘం ప్రకారం గత ఏడాది జూలై నెల డీఏ పెంపు ప్రకటన అక్టోబర్ 2024లో వచ్చింది. ఆ సమయంలో డీఏ 3 శాతం పెరిగింది. దాంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఏ అనేది ఎప్పుడూ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2026 జనవరి వరకు అమల్లో ఉంటుంది. అప్పటి నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది.
Also read: Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి