Hyper Aadi Satires on Anchor Rashmi బుల్లితెరపై హైపర్ ఆది, యాంకర్ రష్మీ, సుధీర్ వంటి వారికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా రష్మీ సుధీర్ ట్రాక్ బుల్లితెరపై అలా సాగుతూనే వస్తోంది. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని, తాము తెరపై ఏం చేసినా కూడా అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమేనని రష్మీ, సుధీర్ ఎంతో క్లారిటీగా చెబుతుంటారు. అయినా కూడా వారి అభిమానులు మాత్రం అదేమీ పట్టించుకోరు.
రష్మీ సుధీర్ రియల్ లైఫ్లో ఒక్కటవ్వాలని కోరుకుంటారు. పెళ్లి చేసుకోండని సలహాలు ఇస్తుంటారు. అలా రష్మీ సుధీర్ ట్రాక్ బుల్లితెరపై ఎప్పటికీ ఎవర్ గ్రీన్లానే ఉంటుంది. రష్మీ సుధీర్ కలిసి ఎన్నో షోలు చేశారు. ఈవెంట్లలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు సుధీర్ తన సినిమాలతో బిజీగా ఉండటంతో.. బుల్లితెరకు దూరమయ్యాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల నుంచి సుధీర్ తప్పుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook