Kangana Ranaut: విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మరో కేసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని..కేసు నమోదు చేయాలని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Last Updated : Oct 17, 2020, 05:18 PM IST
Kangana Ranaut: విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మరో కేసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana ranaut) ఈసారి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని..కేసు నమోదు చేయాలని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. తాజాగా ముంబై పోలీసుల్ని ( Mumbai police ) బాబర్ సేనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావర్లీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ( Bandra Court ) కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు కొత్తగా మరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. 

నిత్యం ఘాటైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది కంగనా. మొదట్లో నెపోటిజంపై  వ్యాఖ్యలు చేసింది. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని( Maharashtra Government ) టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే, ఎంపీ సంజయ్ రౌత్ లపై విరుచుపడటమే కాకుండా టార్గెట్ చేసింది. అనంతంర జయాబచ్చన్ పై చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఇటీవల వ్యవసాయచట్టంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతుల్ని తీవ్రవాదులతో పోల్చి..కోర్టు ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు ఏకంగా ముంబై పోలీసులపై వ్యాఖ్యలు చేసి మరింత వివాదాస్పదమైంది.

ప్రస్తుతం కంగనా రనౌత్..తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి లో టైటిల్ రోల్ పోషిస్తోంది. Also read: Good News: ప్రైవేట్ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త!

Trending News