ఐదేళ్ల కిందటే లక్ష్మీనారాయణను కలిశాను కానీ.. : పవన్ కల్యాణ్

జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

Last Updated : Mar 17, 2019, 04:36 PM IST
ఐదేళ్ల కిందటే లక్ష్మీనారాయణను కలిశాను కానీ.. : పవన్ కల్యాణ్

విజయవాడ: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులైన లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరనున్నారనే సస్పెన్స్‌కి తెరపడింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో లక్ష్మీనారాయణ ఆదివారం ఆ పార్టీలో చేరారు. లక్ష్మీనారాయణతో పాటు మాజీ వీసీ రాజగోపాల్‌ కూడా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. 

లక్ష్మీనారాయణ పార్టీలో చేరిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావం కన్నా ముందే తాను లక్ష్మీనారాయణతో మాట్లాడానని.. అప్పడే కలిసి పని చేద్దామని భావించినా అది కుదరలేదని తెలిపారు. 2014లో అనుకున్నది.. 2019లో సాధ్యమైందన్నారు. ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ధన ప్రవాహం అధికమైందని, అది చూసి జనమే రాజకీయాలను చీదరించుకుంటున్నారని అసహనం వ్యక్తంచేశారు. అయితే, తాము మాత్రం అలా కాకుండా సమాజంలో, రాజకీయాల్లో మార్పును తీసుకొచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చామని పవన్ అన్నారు.

Trending News