Petrol Price: మోదీ అమెరికా పర్యటన వేళా మరో దెబ్బకొట్టిన ట్రంప్..భారత్ లో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

Petrol Price:  మనదేశానికి ఎక్కువగా రష్యా నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురుపై ప్రభావం పడుతుందా. దీని కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..పూర్తి వివరాలు చూద్దాం. 

1 /7

Petrol Price: ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ట్రంప్ భారత్ కు భారీ షాకిచ్చినట్లే చేసింది. ఎందుకంటే మన దేశానికి దిగుమతి అవుతున్న చమురులో రష్యా నుంచే దాదాపు 40 శాతం ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ కు రష్యా చమురు సరఫరా భారీగా పెరిగింది. తక్కువ ధరకే లభిస్తుండటంతో భారత్ ఎక్కువగా రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల చమురు వాణిజ్యంపై ఓ పిడుగు పడింది.

2 /7

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం  చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రష్య చమురు ఎగుతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో రష్యా నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రభావం భారత్ పై పడుతుందా. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా చూద్దాం. 

3 /7

రష్యా చమురు రంగంపై అమెరికా కొత్త ఆంక్షలు విధించినప్పటికీ భారత్ కు సరఫరా అయ్యే ఆ దేశ చమురుపై ఉండకపోవచ్చని రష్యా డిప్యూటీ ఇంధన మంత్రి పావెల్ సోరోకిన్ తెలిపారు. అమెరికా ఆంక్షలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.

4 /7

 ఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులోనూ ఇండియాకు తమ సహకారం ఉంటుందన్నారు.

5 /7

రాజకీయాల వల్ల ఇంధన వాణిజ్యం దెబ్బతీయకూడదనేది మేము భావిస్తున్నాం. ద్వైపాక్షిక , బహుళపాక్షిక పద్ధతుల్లో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని రష్యా ఇంధన మంత్రి పావెల్ సోరోకిన్ తెలిపారు.   

6 /7

రష్యా చమురు ఉత్పత్తి సంస్థలు గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సర్గెట్ నెప్ట్ గ్యాస్ తో పాటు ఆదేశం నుంచి చమురును సరఫరా చేస్తే 183 నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా రష్యా ఇంధన ఎగుమతులు తగ్గిపోతాయని..దీంతో ఉక్రెయిన్ పై ఆదేశం చేస్తున్ను యుద్ధానికి ఆర్థిక వనరులు తగ్గిపోతాయని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

7 /7

ప్రస్తుతం భారత్ లో ఢిల్లీ హైదరాబాద్ తోపాటు ముఖ్య నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే ఢిల్లీలో లెటర్ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.81 ..లీటర్ డీజిల్ ధర రూ. 87.71 ఉండగా.. ముంబైలో లీటర్ డీజిల్ రేటు రూ. 90.01..లీటర్ పెట్రోల్ రేటు రూ. 103.49  ఉంది.అటు  బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.102.90..లీటర్ డీజిల్ రేటు రూ.88.98ఉంది.  హైదరాబాద్ లో పెట్రోల్ లీటరుకు రూ. 107.45..డీజిల్ లీటరుకు రూ. 95.69 ఉంది.