February 19th Schools Holiday: పాఠశాలలకు మరో సెలవు వచ్చేసింది. అన్ని పాఠశాలలకు రేపు ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లభించడంతో విద్యార్థులకు ఇది తీపి కబురులాంటిది. విద్యా క్యాలెండర్లో ప్రకటించిన ఈ సెలవు ఎందుకో తెలుసుకుందాం.
రేపు విద్యాసంస్థలకు సెలవు లభించింది. అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవును ఎప్పుడో విద్యా క్యాలెండర్లో ప్రకటించారు. క్యాలెండర్ ప్రకారం బుధవారం విద్యా సంస్థలకు సెలవు వచ్చింది.
మరాఠా సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దేశంలోనే హిందూత్వ సామ్రాజ్యానికి దిక్సూచిగా శివాజీ ఉన్నారు. మరాఠా గడ్డ పౌరుషంగా శివాజీని పరిగణిస్తారు. మరి అలాంటి శివాజీ జయంతిని అక్కడ పబ్లిక్ హలీడేగా ఉంది.
మహారాష్ట్ర విద్యా సంవత్సరం క్యాలెండర్లోనే ఛత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించారు. గతేడాది ప్రకటించిన 2024-2025 విద్యా సంవత్సరం క్యాలెండర్లో ఫిబ్రవరి 19వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో అధికారికంగా సెలవు ఉంది. బ్యాంకులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మహారాష్ట్రలో ఒక పండుగలా చేసుకుంటున్నారు. తమ గడ్డకు ఒక ప్రతీకగా.. ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా శివాజీ నిలిచారు. దేశంలో మహారాష్ట్ర గడ్డకు శివాజీ ప్రత్యేకత తీసుకువచ్చారు.
శివాజీ జయంతి దేశవ్యాప్తంగా సంబరంగా చేసుకుంటారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో శివాజీ జయంతికి కూడా సెలవు ఉన్నాయి. అయితే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో సెలవు ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం సెలవు ఇవ్వలేదు.