Pawan Kalyan: మహాకుంభమేళాలో భార్య, కుమారుడితో పవన్‌ కల్యాణ్‌ పుణ్యస్నానం.. పిక్స్‌ వైరల్‌

Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

1 /6

దశాబ్దం తర్వాత జరిగే అతిపెద్ద హిందూవుల ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభా మేళ కోలాహలంగా.. భక్తిపూర్వకంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో మహాకుంభమేళ ముగుస్తుండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

2 /6

సనాతనం ధర్మం పేరిట ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మహాకుంభమేళలో పాల్గొన్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారు.

3 /6

త్రివేణి సంగమంలో తన సతీమణి అనాలెజ్నోవా కొణిదెల, తనయుడు అకీరా నందన్, అతడి స్నేహితుడు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పవన్‌ కల్యాణ్‌ మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేశారు.

4 /6

పుణ్య స్నానం ఆచరించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ తన కుటుంబంతో కలిసి గంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

5 /6

కుంభమేళాలో పవన్‌ కల్యాణ్‌ కుటుంబం పుణ్యస్నానాలకు అక్కడి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్‌ కల్యాణ్‌ అక్కడి అధికారులు విశేష గౌరవం అందించారు.

6 /6

పుణ్యస్నానం అనంతరం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళకు యోగి ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక యాత్ర, రాజకీయ అడుగులు, సనాతన ధర్మంపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.