Heat Alert: ఎండాకాలం ముందే వచ్చేసింది.. నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు..

Heat Alert In AP: వాతావరణంలో వేడి పెరిగింది.. ఎండాకాలం ముందే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే, నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
 

1 /5

ఎండాకాలం సీజన్‌ ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి సమయంలో వేడి విపరీతంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినందుకు ఈ సారి ఎండాకాలం ముందే వచ్చింది.  

2 /5

వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీలు కూడా నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు.  

3 /5

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువ ఉండనుందని అంచనా వేస్తున్నారు.  

4 /5

ఫిబ్రవరి నెల ప్రారంభం ముందే ఎండ మొదలైంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత విపరీతంగా పెరిగింది. శివరాత్రి తర్వాత ప్రారంభం అయ్యే ఎండ ఈసారి ముందే వచ్చేసింది.  

5 /5

ఈనేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో వీరు బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు..