Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే

 ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.

Changes From 1 April 2021: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.

1 /5

ఏప్రిల్ 1 నుంచి విమాన ప్రయాణికులు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పెంచారు. డొమెస్టిక్ ప్రయాణికులు రూ.200 మేర, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు 12 డాలర్ల చొప్పున ఈ పెరిగిన ధరలు చెల్లించాల్సి ఉంటుంది. అధికార పర్యటన కోసం డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారికి, కొందరు ప్రత్యేక ప్రయాణికులకు ఈ ఫీజులు వర్తించవు. Also Read: Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు

2 /5

దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అలహాబాద్ బ్యాంక్ - ఈ ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులలో మీకు బ్యాంక్ ఖాతా ఉంటే ఇక నుంచి వారి పాస్ బుక్ మరియు చెక్ బుక్ పనిచేయవు. ఎందుకంటే ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అయ్యాయి. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్‌లో, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అయ్యాయి. Also Read: Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్

3 /5

ఏప్రిల్ 1, 2021 నుండి TDS (పన్ను మినహాయింపు) కోసం ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని నియమాలు కూడా మార్చారు. ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను దాఖలు చేయకపోతే, బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ రేటు రెట్టింపు అవుతుంది. Also Read: ITR Refund Status: మీ ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకున్నారా, సులువైన విధానం మీకోసం

4 /5

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈపీఎఫ్ ఖాతాలో నగదు నిల్వలు సైతం ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ మార్పులు తీసుకొచ్చింది. రూ.2.5 లక్షలు మించి చేసే ఈపీఎఫ్ పెట్టుబడులపై పన్ను వసూలు చేయనున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్, వీపీఎఫ్ కలిపి గరిష్టంగా రూ.2.5 లక్షల లోపు జమ చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

5 /5

ప్రతి నెల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఎల్‌పీజీ ధరల పెరుగుతాయి. మార్చి 2021లో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ .769 నుంచి రూ .819 కు పెంచారు. ఏప్రిల్‌లోనూ మరోసారి ధర పెరిగే అవకాశం ఉంది.  స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook