Amrapali Kata: ఆమ్రపాలీకి బంపర్ బొనాంజా.. కీలక శాఖను కేటాయించిన ఏపీ సర్కారు.. మిగతా ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్..

Ap Govt allotted posts to tg cadre ias: తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు ఎట్టకేలకు చంద్రబాబు సర్కారు పోస్టింగ్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది.

1 /6

తెలంగాణ నుంచి అనేక నాటకీయ పరిణామల మధ్య ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏపీకి వెళ్లి అక్కడ రిపోర్టు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల నుంచి వీరికి ఏపీ సర్కారు ఎలాంటి శాఖలను కేటాయించలేదు.

2 /6

దీంతో మళ్లీ వీళ్లు తెలంగాణకు వస్తారని కూడా జోరుగా ప్రచారం సైతం జరిగింది,.ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకుని,,  మళ్లీ తెలంగాణకు కొంతమంది ఐఏఎస్ లను వెనక్కు పిలిపించుకుంటారని వార్తలు వచ్చాయి.

3 /6

అందుకే ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేసి చాలా రోజులు గడుస్తున్న అందుకే ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకుండా హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేేపథ్యంలో ఆమ్రపాలీ విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది.

4 /6

ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు.. దీపావళికి ముందు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తొంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి ఐఏఎస్ లకు కీలక శాఖలు కేటాయిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది.  

5 /6

ఈ మేరకు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలీ ఏపీ టూరిజం వీసీఎండీగా, టూరిజం అథారిటీ సీఈవో గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. వైద్యారోగ్య శాఖ కమిషనర్ గా వాకాటి కరుణ , జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

6 /6

అదేవిధంగా.. జేఏడీలో పురావాస్తు, మ్యూజీయం శాఖ  ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ రోనాల్డ్ రాస్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తొంది.