Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు యాక్ట్రెస్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ భారత్ చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ తెలుగులో జెండా పాతాలని చూస్తోంది.
జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో లెగ్ పెట్టింది. ఇక తొలి చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. రెండో భాగంలో జాన్వీ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందా అనేది వెయిట్ అండ్ సీ. మొత్తంగా సినిమా సక్సెస్ అయినా.. జాన్వీకి పెద్దగా ఒరిగిందేమి లేదు.
జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 7 ఇయర్స్ అవుతోంది. అయినా ఇప్పటికీ హీరోయిన్ గా సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.
మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర సెకండ్ పార్ట్.. రామ్ చరణ్ తో RC 16 చిత్రంతో తెలుగులో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలని చూస్తోంది జాన్వీ కపూర్.
జాన్వీ కపూర్.. హిందీ చిత్రం 'ధడక్' తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన చిత్రాలు ఎక్కువగా థియేటర్ లో కాకుండా.. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ వచ్చాయి.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయనే చెప్పాలి. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇన్నేళ్లలో జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే ఈమెను ప్రేక్షకులు గుర్తుస్తున్నారు. బాలీవుడ్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.