సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (సెప్టెంబర్ 24,2018) ప్రారంభించారు.
గ్యాంగ్టక్కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మించింది. అత్యంక సంక్లిష్టతల మధ్య 9ఏళ్లు శ్రమించి దీన్ని నిర్మించారు.
సుమారు రూ.605 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం.. 206 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు విస్తరించి ఉంది.
సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఈ విమానాశ్రయం ఉంది.
అక్టోబర్ 4, 2018 నుంచి ఢిల్లీ, కోల్కతా, గౌహతిలకు ఇక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.
భారత్-చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
ఇది దేశంలో ప్రయాణికుల సేవలు అందించే 100వ విమానాశ్రయం.
Next Gallery