IPL 2020: నేటి నుంచి ఐపిఎల్ షురూ.. మెగా లీగ్ కు సర్వం సిద్ధం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నేడు విదేశంలో ప్రారంభం కానుంది.

  • Sep 19, 2020, 14:08 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నేడు విదేశంలో ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాం నెలకొంది. వారి ఉత్సాహానికి తగిన విధంగా దుబయి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

1 /5

కరోనావైరస్ వల్ల విసిగిపోయిన ప్రజలకు ఐపీఎల్ 2020 ఊరటనివ్వనుంది. వేలాది కోట్లు విలువ చేసే టోర్నిని బీసిసిఐ దేశంలో నిర్వహించలేకపోవడంతో దుబయిలో నిర్వహించాల్సి వస్తోంది. ఈ సారి దుబయిలోనే అన్ని మ్యాచులు జరగనుంది. నేటి నుంచి అరేబియా నుంచి అదిరిపోయే క్రికెట్ ను చూడవచ్చు.

2 /5

యూఎఈ అధికారులు తమ వైపు నుంచి అన్నీ సిద్ధం అని ప్రకటించారు. అద్భుతమైన మెరుపులు, గ్రాండ్ స్టార్టింగ్ అన్నీ సిద్ధం అని తెలిపారు. మైదానాలు మెరిసిపోతాయి అంటున్నారు.

3 /5

అయితే ప్రతీ ఏడాదిలా ఈ సారి మెగా ఈవెంట్ తో లీగ్ ప్రారంభం కాదు. ఇందులో చీర్ లీడర్స్ కూడా ఉండరు. ప్రేక్షకులకు కూడా ప్రవేశం లేదు. 

4 /5

గ్రాండ్ సెర్మనీ లేకుండా ఐపీఎల్ ప్రారంభం కావడం ఇది వరుసగా రెండోసారి.  పుల్వామా దాడి తరువాత బీసిసిఐ  సెర్మనీని గత ఏడాది రద్దు చేసింది. ఈ సారి కరోనావైరల్ వల్ల వేడుకలు ఉండబోవు.   

5 /5

ఈ సారి దుబయి, అబుధాబి, షార్జాలో మ్యాచులు జరుగుతాయి. ఇవాళ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.