AP Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు మరో తుపాను ముప్పు.. తెలంగాణలోను భారీ వర్షాలు..

AP Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

1 /6

వాయుగుండం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారొచ్చునని తెలిపింది.

2 /6

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.  

3 /6

మరోవైపు నేడు నిర్మల్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

4 /6

అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.   ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

5 /6

హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది.  ఉదయం కాస్త ఎండగా ఉంటుందని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని తెలిపింది.    

6 /6

సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా నిన్న సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.