Petrol Price Hiked: దేశంలో ఆగని పెట్రో మోత- వరుసగా మూడో రోజు ధరల పెంపు

Fuel Price Hiked: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్​ ధరల మోత ఆగటం లేదు. వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 10:39 AM IST
  • వరుసగా మూడో రోజు పెట్రో బాదుడు
  • రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు
  • వైజాగ్​లో 70 పైసలు పెరిగిన పెట్రోల్ రేట్​
Petrol Price Hiked: దేశంలో ఆగని పెట్రో మోత- వరుసగా మూడో రోజు ధరల పెంపు

Petrol Price Today: దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Price Hiked) మరోసారి పెరిగాయి. ఈ వారంలో ధరలు పెరగటం వరుసగా ఇది మూడో రోజు. ఇప్పటికే ఆల్​టైం రికార్డు వద్ద ఉన్న ధరలు తాజాగా మరో కొత్త గరిష్ఠానికి చేరాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోల్​ ధరలతో వాహనాదారుల జేబులకు చిల్లు పడుతోంది

అయితే అంతర్జాతీయంగా పెరిగిన ముడి చుమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్​, డీజిల్ ధరలను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వెల్లడించాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ధరలు..

హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్ (Petrol price in Hyderabad)​ 36 పైసలు పెరిగి.. రూ.111.14 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38 పైసలు పెరిగి.. రూ.104.28 వద్ద ఉంది.
విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో 70, 74 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.111.92 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.104.50 వద్ద ఉన్నాయి.

Also read: Gold Demand: 2022 నాటికి బంగారం డిమాండ్ భారీగా పెరగనుందా

ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Delhi) 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.89, రూ.95.63 వద్ద ఉన్నాయి.

బెంగళూరులో పెట్రోల్ ధర ( Petrol Price in Bangalore) లీటర్​ 36 పైసలు పెరిగి రూ.110.57 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.101.45 వద్దకు చేరింది.

చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chennai) లీటర్​ 30 పైసలు పెరిగి.. రూ.103.88 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి (Diesel Price in Chennai) రూ.99.89 వద్దకు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర (Petrol Price in Mumbai) లీటర్​ 33 పైసలు పెరిగి రూ.112.74కి చేరింది. లీటర్ డీజిల్ ధర 38 పైసలు పెరిగి (Diesel Price in Mumbai) రూ.103.60 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 33 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్  (Petrol Price in Kolkata) రూ.107.44 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ రూ.98.73 వద్ద కొనసాగుతోంది.

రాజస్థాన్​లోని గంగానగర్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.118.96 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.109.79 వద్ద కొనసాగుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇదే.

Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్​- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ధరలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News