Dussehra 2024: దసరా ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఎక్కడో తెలుసా?

Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్‌ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు. అయితే, దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?
 

1 /5

ఉత్తరప్రదేశ్‌.. ఇది మొదటగా చెప్పుకోవాల్సిన ప్రదేశం. ఉత్తరప్రదేశ్‌లో దసరా వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ వారణాసి నగరంలో రావణ దహనం కన్నులపండువగా కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి దసరా ఉత్సవాలు చూడాల్సిందే.

2 /5

రాజస్థాన్‌.. దసరా ఉత్సవాలు రాజస్థాన్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక్కడి సంప్రదాయపు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. చంబల్ నదీ తీరంలో రావణ దహనం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

3 /5

మైసూర్‌.. అసలు దసరా అంటేనే మైసూర్‌. ఇక్కడ ఆయుధ పూజ కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దర్బార్‌ నిర్వహిస్తారు. మైసూరు ప్యాలస్‌ను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఇక్కడ కూడా సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరిస్తాయి.

4 /5

హిమాచల్ ప్రదేశ్.. హిమాచల్‌ ప్రదేశ్‌లో దసరా వేడుకలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. హిమాచల్‌ అంటేనే హిల్‌ టౌన్‌. ఇక్కడకు ఒక్కసారైనా వచ్చి దసరా వేడుకలను తనివితీరా చూడవచ్చు.

5 /5

గుజరాత్‌.. దసరా వేడుకల్లో గర్భా డ్యాన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుజరాత్‌లోనే ఇది పుట్టింది. అయితే, ఇక్కడ నవరాత్రుల్లో ప్రతిరోజూ గర్భా డ్యాన్స్‌ వేస్తూ ఉంటారు. దండియా కూడా మరో ఆట.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)