Anasuya Bharadwaja At Numaish photos: తెలుగు స్టార్ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఇటీవల హైదరాబాద్ లోని ప్రముఖ నాంపల్లి ఎగ్జిబిషన్కు ఆమె వెళ్లారు. ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయ్యో మేడం మిమ్మల్ని గుర్తుపట్టలేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
స్టార్ యాంకర్ 'పుష్ప' నటి అనసూయ నాంపల్లి ఎగ్జిబిషన్లో హల్చల్ చేశారు. ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నుమాయిష్లో కొడుకుతోపాటు అనసూయ హల్చల్ చేసింది. అక్కడ బజ్జీలు తింటూ తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక అనసూయ ఈ ఎగ్జిబిషన్లో తిరుగుతూ కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఈ అతిపెద్ద ఎగ్జిబిషన్కు అనసూయ సింపుల్ గా వెళ్లడం ఆశ్చర్యకరం.
ఇక అనసూయ ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.' అయ్యో మేడం మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదా?' అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలో అనసూయ ఫుల్ గా మాస్క్ పెట్టుకొని అద్దాలు ధరించారు. అంతేకాదు టోపీ కూడా ధరించింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఆమెను గుర్తుపట్ట లేకపోయారు.
ఇక నుమాయిష్లో అనసూయ తనకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తూ.. గేమ్స్ కూడా ఆడారు. తన అబ్బాయితో కలిసి బజ్జీలు కూడా తింటూ ఎంజాయ్ చేశారు.