Sai Pallavi: ఫోన్ చేస్తే సాయి పల్లవి అంత మాటనేసింది.... అసలు నిజం బైటపెట్టిన తమిళ హీరో.. బుక్ అయిపోయిందిగా..

Sivakarthikeyan on Saipallavi: అమరన్ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ కనగ రాజ్, మణిరత్నం సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు హజరయ్యారు.

1 /8

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతోపాటు, అభినయంతో ఆడియన్స్ ను సంపాదించుకుంది. తనకంటూ స్పెషల్ గా కనెక్ట్ అయ్యే సినిమాలు మాత్రమే సాయి పల్లవీ చూజ్ చేసుకుంటుంది. ఫిదా సినిమాతో తెలంగాణ యాసతో తెగ రచ్చ చేసన విషయం తెలిసిందే.

2 /8

తాజాగా, ఈ భామ.. అమరన్ ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శివకార్తీకేయర్, సాయి పల్లవి జంటగా అమరన్ మూవీని ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా..దీపావళి కానుకగా..అక్టోబరు 31న విడుదల కానుందని తెలుస్తోంది.

3 /8

నిజ జీవిత ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి  ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. హీరో శివ కార్తికేయన్ ఆడియో లాంచ్ లో మాట్లాడారు. గతంలో సాయి పల్లవితో మాట్లాడిన ఒక ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

4 /8

  శివకార్తీకేయన్ .. ఒక ఛానల్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశారంట. అయితే.. సాయి పల్లవి ‘ప్రేమమ్‌’మూవీలో నటన చూసి ఆశ్చర్యపోయారంట. ఉండబట్టలేక ఎలాగైన స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్పాలని.. ఫోన్‌ చేసి ప్రశంసించారు. ఆమె వెంటనే ‘థ్యాంక్యూ అన్నా’ అని అన్నారంట. ఆ మాట వినగానే.. గుండెలో జారీపోయినట్లు అన్పించిందంట.

5 /8

ఆమాటలకు మాత్రం శివకార్తీకేయన్ ఫీలయ్యారంట. తాజాగా, గతంలో తనకు కల్గిన అనుభవాన్ని అందరి ముందు చెప్పుకుని సరదాగా నవ్వేవారు. దీనికి సాయి పల్లివి కూడా పగలబడి మరీ నవ్వేసింది.   

6 /8

ఇదిలా ఉండగా.. ‘‘మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ గురించి మొదట వార్తల్లో విన్నట్లు శివకార్తీకేయన్ చెప్పారు.. రాజ్‌ కుమార్‌ ఈ కథను వివరించినప్పుడు ఎమోషనల్ అయినట్లు చెప్పారు.  కశ్మీర్‌లో 100రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. రాత్రిపూట కావడంతో చలి ఎక్కువగా ఉండేది.

7 /8

ఈ చిత్రం క్లైమాక్స్‌ అందరినీ కంటతడి పెట్టిచడం ఖాయమన్నారు. మేజర్  ముకుంద్‌ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్నిఈ మూవీ కళ్ల ముందు ఉంచుతుందన్నారు. ఈ సినిమాకి.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

8 /8

ఈ మూవీ గురించి సాయి పల్లవీ మాట్లాడుతూ.. మేజర్ పాత్రలో.. శివకార్తీకేయర్ ఒదిగిపోయారన్నారు. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమాను దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబర్ 31న ఈ అమ‌ర‌న్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్లడించారు.