టీడీపీ వైసీపీ పోటా పోటీ ఫిర్యాదులు; దాడి ఘటనపై గవర్నర్ కు కోడెల కంప్లైంట్

గవర్నర్ నరసింహన్ తో ఏపీ అంసెబ్లీ స్పీకర్ కోడెల భేటీ అయ్యారు

Last Updated : Apr 20, 2019, 06:53 PM IST
టీడీపీ వైసీపీ పోటా పోటీ ఫిర్యాదులు; దాడి ఘటనపై గవర్నర్ కు కోడెల కంప్లైంట్

ఎన్నికల సమయంలో దాడులపై  టీడీపీ నేత కోడెల శివప్రసాద్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.  ఇనిమెట్ల పోలింగ్ స్టేషన్ లో వైసీపీ వారు తన పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వివరించారు. దీనికి సంబంధించిన వినితిప్రతాన్ని గవర్నర్ కు అందించారు

గవర్నర్ తో భేటీ అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు.  ఏపీ ఎన్నికల్లో జరిగిన హింస, ఘర్షణల గురించి గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు.  ఏపీలో అధికార పక్షానికి గవర్నర్ చాలా బాగా సహకరించారని కొనియాడారు

ఇనిమిట్ల ఘటనను ప్రస్తావిస్తూ వైపీపీ వారు కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన అనంతరం కోడెలపై పీఎస్ లో కేసు నమోదు వంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోడెల గవర్నర్ తో భేటీ ప్రాధాన్యత  సంతరించుకుంది

Trending News