Nellore News: నెల్లూరు జిల్లాలో దారుణం.. అడ్డొచ్చిన వారిపై ట్రాక్టర్‌తో దాడి.. సర్పంచ్ భర్త మృతి

Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో జరిగిన భూవివాదంలో సర్పంచ్‌ కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేయగా.. సర్పంచ్ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 07:22 PM IST
Nellore News: నెల్లూరు జిల్లాలో దారుణం.. అడ్డొచ్చిన వారిపై ట్రాక్టర్‌తో దాడి.. సర్పంచ్ భర్త మృతి

Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో జరిగిన ఘర్షణలో గ్రామ సర్పంచ్ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మర్రిపాడు మండలం భీమవరం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా.. భీమవరం గ్రామ సర్పంచ్ భర్త మంద రామరత్నారెడ్డికి ఆయన తమ్ముడు కుమారుడు మంద రఘురామిరెడ్డికి మధ్య గత కొన్నేళ్లుగా పొలం వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రఘురామిరెడ్డి వివాదంలో ఉన్న పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రత్నారెడ్డి, అతని భార్య ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఆ వివాదం కాస్త మరింత ముదిరింది. అప్పటికే ట్రాక్టర్‌పై ఉన్న రఘురాం రెడ్డి.. అడ్డొచ్చిన వారందరిపైన విచక్షణారహితంగా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో సర్పంచ్ భర్త రామ రత్నారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News