Muthyalamma Idol issue: ముత్యాలమ్మ ఆలయం దగ్గర హైటెన్షన్.. ఇంటర్నేట్ సేవల నిలిపివేత.. రంగంలోకి అదనపు బలగాలు..

Muthyalamma temple: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు నిరసన తెలియజేస్తున్న వారిపై లాఠీ చార్జీ చేశారు. అంతేకాకుండా అదనపు బలగాలను పోలీసులు రప్పించినట్లు తెలుస్తోంది.

1 /7

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం  ధ్వంసంపై తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై హిందుసంఘాలన్ని తీవ్రంగా పరిగణించాయి. ఈ రోజు హిందు సంఘాలన్ని నిరసనలు చేపట్టాయి.

2 /7

దీనిలో భాగంగా..సికింద్రాబాద్ లో నిరసనలు చేపట్టారు. ఈరోజు బంద్ కూడా ప్రకటించాయి. అయితే.. పెద్ద ఎత్తున నిరసన కారులు చేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ హిందు సంఘాలన్ని తమకు న్యాయం చేయాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు సైతం చేస్తున్నారు

3 /7

ఈ క్రమంలో అక్కడ హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తు సలీం బస చేసిన లాడ్జీవైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట సంభవించింది. దీనిలో నిరసన కారులు తొక్కిసలాటకు గురైనట్లు సమాచారం.

4 /7

పోలీసులకు , స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. దీంతో అక్కడ మాత్రం..  ఒక్కసారిగా ఇంటర్నేట్ సేవలు సైతం బంద్ చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులు అత్యుత్సాహాం ప్రదర్శించి లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం.

5 /7

ఈ నేపథ్యంలో అక్కడ కొంత మంది నిరసన కారులు.. మాత్రం పోలీసుల మీద ప్యాకెట్ లు, చెప్పుల్ని సైతం విసిరినట్లు తెలుస్తోందీ. ప్రస్తుతం అయితే..అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి. 

6 /7

తమ ఆలయం మీద దాడిచేసిన నిందితుడ్ని మాత్రం కఠినంగా పనిష్మెంట్ చేయాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. దీనిపై ఇప్పటి దాక రేవంత్ సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు.

7 /7

ఇప్పటికైన సీఎం రేవంత్ ఈగోలకు పోకుండా.. అమ్మవారి ఆలయంకు వచ్చి.. అమ్మవారికి దండం పెట్టుకుని, యావత్ హిందు సమాజానికి తప్పుపై ప్రాయిశ్చిత్తం చేసుకొవాలని కూడా నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు.