గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారా?

Dharmaraju Dhurishetty
Feb 04,2025
';

కొంతమంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనే, చియా సీడ్స్ కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం ఎంతవరకు మంచిది?

';

రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

';

గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో పాటు తేనె కలుపుకొని తాగడం వల్ల నష్టాలకంటే ఎక్కువగా లాభాలే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ప్రతిరోజు ఈ గోరువెచ్చని నీటిని తాగితే.. శరీరానికి తగిన మోతాదులో విటమిన్ సి లభిస్తుంది దీనివల్ల బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మొత్తం తొలగిపోతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

';

చాలామంది తరచుగా జీర్ణ క్రియ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. రోజు ఇలా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకుంటారడం వలన బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది.

';

సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం, తేనె ఒక వరమని చెప్పొచ్చు.. ఇలా తాగడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సింపుల్గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ప్రతిరోజు ఇలా గోరువెచ్చని నీటిలో రెండు మిక్స్ చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

';

ముఖ్యంగా నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

నిమ్మరసం, తేనే మిశ్రమాలను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసుకొని తాగితే.. గొంతు నొప్పి కూడా సులభంగా తొలగిపోతుంది. అలాగే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

';

గోరువెచ్చని నీటిలో వీటిని కలుపుకొని తాగితే శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

';

తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో వీటిని తప్పకుండా మిక్స్ చేసుకొని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

Note: మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నవారు తప్పకుండా వైద్యుల సూచనలు సలహాలు మేరకే తీసుకోవాల్సి ఉంటుంది..

';

VIEW ALL

Read Next Story