ఈ రైస్ అల్పాహారంలో తింటే.. ఎండాకాలం ఒళ్లంతా చలువ చేస్తుంది!

Dharmaraju Dhurishetty
Feb 20,2025
';

వేసవికాలం వచ్చిందంటే చాలు.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి..

';

ముఖ్యంగా వేసవికాలంలో వేడి శరీరం కలిగిన చాలా మందిలో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి..

';

కొంతమందిలో శరీరం ఎక్కువగా వేడి చేయడం వల్ల మూత్రవిసర్జన సమయంలో అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి..

';

వేడి శరీరం కలిగిన వ్యక్తులు పుదీనా ఆకులతో తయారుచేసిన సలాడ్స్, జ్యూస్ లు, రైస్ ను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

ముఖ్యంగా పుదీనాతో తయారుచేసిన రైస్ ని క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల వేసవికాలంలో శరీరాన్ని ఎప్పుడు చలువగా ఉంచుకోవచ్చు.

';

వేడి శరీరం కలిగిన వారు పుదీనా రైస్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1 కప్పు, పుదీనా ఆకులు - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (చిన్నది, తరిగినది), పచ్చిమిర్చి - 2 (చీలికలు), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

';

కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 2 కప్పులు

';

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది..

';

పుదీనా ఆకులను బాగా శుభ్రం చేసి మిక్సీ జార్లో వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని వేడి చేసుకోండి.

';

బాగా వేడి చేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయ చీలికలు, బగారా మసాలా, తురిమి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి వేపుకోండి.

';

అన్ని బాగా వేసిన తర్వాత అందులోనే పుదీనా మిశ్రమం కూడా వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత రైస్ వేసి మరికొద్దిసేపు అటు ఇటు కలుపుతూ వేసుకోండి.

';

అన్ని బాగా వేగిన తర్వాత బియ్యం ఉడకడానికి కావాల్సినంత నీటిని పోసుకొని.. బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఓసారి చెక్ చేసుకుని సర్వ్ చేసుకోండి..

';

VIEW ALL

Read Next Story