కరకరలాడే దోసలతో నోరూరించే అల్లం పచ్చడి ఆరోగ్యానికి మంచి రుచిని ఇస్తుంది.
ఈ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు..అల్లం ముక్కలు 75 గ్రాములు, పచ్చిమిర్చి 200 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, ఉప్పు సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు.
అల్లం, పచ్చిమిర్చి ముక్కలను తరిగి, పాన్లో నూనె వేడి చేసి వాటిని వేయించి పక్కన పెట్టండి.
చింతపండు ముక్కలను నూనెలో వేయించి, బెల్లం పొడి కూడా కొద్దిగా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్లా గ్రైండ్ చేయండి. చివరిగా ఈ పచ్చడిని.. తిరగమాత పెట్టుకోండి.
అల్లం పచ్చడిని దోసలతో లేదా ఇడ్లీలతో సర్వ్ చేయండి. ఇది మీ టిఫిన్ను రుచికరంగా మార్చుతుంది.
పచ్చడిని ఫ్రిజ్లో నిల్వ చేసి, కొన్ని రోజుల పాటు ఉపయోగించవచ్చు.
ఇంట్లో అందరూ ఇష్టపడే ఈ అల్లం పచ్చడి.. బరువు తగ్గడానికి అలానే జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది.