కొంతమంది సులభంగా బరువు తగ్గినప్పటికీ వెంటనే పెరుగుతున్నారు.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
';
బరువు తగ్గినప్పటికీ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. అందులో ప్రధాన కారణం ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోకపోవడం.
';
కొంతమంది అయితే ఎలాంటి ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకున్నప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు.
';
కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అందులో ఒక రెసిపీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
';
సులభంగా బరువు తగ్గించే రెసిపీల్లో.. గోధుమ రవ్వతో చేసిన దోస ఒకటి.. ఇది తింటే సులభంగా బరువు తగ్గగలుగుతారు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
';
కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ - 1 కప్పు, బియ్యం పిండి - 1/2 కప్పు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన)
';
కావలసిన పదార్థాలు: అల్లం - 1/2 టీస్పూన్ (చిన్నగా తరిగిన), జీలకర్ర - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - తగినంత, నెయ్యి - కాల్చేందుకు
';
తయారీ విధానం: ముందుగా గోధుమ రవ్వను, దోస పిండిని ఓ బౌల్లోకి తీసుకొని బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని కలుపుకోండి.
';
కలుపుకున్న పిండిని దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే తగినంత ఉప్పు, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని దానిపై నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి.. చిన్న చిన్న దోసలు వేసుకోండి. రెండువైపులా కాల్చుకున్న తర్వాత దోసలను తీసి పక్కన పెట్టుకోండి.