Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.

Last Updated : Jul 20, 2020, 02:01 PM IST
Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ( Ap Deputy cm ) , రెవిన్యూ మంత్రి ( Ap Revenue minister ) పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Pilli Subhash Chandra Bose ) , పశు సంవర్ధక శాఖ మంత్రి ( Animal Husbandry minister ) మోపిదేవి వెంకట రమణ ( Mopidevi venkata Ramana ) లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటిపై చాలామంది ఆశావహులు కన్నేశారు. అయితే ఖాళీ అయిన రెండు బెర్త్ లు బీసీలకు చెందినవి కావడంతో...అదే సామాజికవర్గంతో భర్తీ చేయించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచనగా ఉందని తెలియడంతో బీసీయేతర ఆశావహులు నిమ్మకుండిపోయారు. మరి ఆ బెర్త్ లకు భర్తీ అయ్యే వారు ఎవరు ? Also read: Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

ఈ నేపధ్యంలోనే అమాత్యా అని పిలిపించుకోవాలనుకుంటున్న ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్ ( Ap speaker Tammineni Sitaram ) పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందడం, సీనియర్ కావడం అదనపు అర్హతలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) కు నమ్మిన వ్యక్తి కావడం కూడా ఓ విశేషంగా ఉంది. Also read: AP: గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్: ఏం జరగబోతోంది?

అదే జరిగితే మరి స్పీకర్ గా ఎవరనే ప్రశ్న వస్తోంది. దీనికి సమాధానం కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ( Deputy Speaker ) వ్యవహరిస్తోన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి ( Kona Raghupati ) పేరు ప్రధానంగా విన్పిస్తోంది. కోన రఘుపతి తండ్రి కోన ప్రబాకరరావు గతంలో స్పీకర్ గా పనిచేశారు కూడా. రఘుపతికి స్పీకర్ గా నియమిస్తే...బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనే వాదన కూడా ఉంది. మరి ఏపీ సీఎం వైెఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. Also read: ఏపీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x